NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం సభను విజయవంతం చేయాలి…

1 min read

ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే గంగుల

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: ఈనెల 17వ తేదీ ఆళ్లగడ్డ పట్టణంలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు మండలం నుండి పెద్ద ఎత్తున రైతులను తరలించి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలను ఆదేశించారు. మండల కేంద్రమైన రుద్రవరంలోని అమ్మవారి శాలలో శుక్రవారం వారు మండలంలోని వైసిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సీఎం సభకు అధికార యంత్రాంగం గ్రామాలలో రైతులను తరలించేందుకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు ఐకమత్యంతో రైతులను సభకు తరలించాలని సభకు తరలివస్తున్న రైతులకు భోజన సౌకర్యం త్రాగునీరు కల్పించాలని నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలకు సూచించారు. ఈ సమావేశంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి మండల నాయకులు గంధం రాఘవరెడ్డి సీనియర్ నాయకుడు గంగిశెట్టి తిమ్మయ్య శెట్టి ఆయా గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

About Author