PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుటుంబీకులకు సీఎం పరామర్శ..

1 min read

పారుమంచాలలో చంద్రమౌళి అంత్యక్రియలు..

పల్లెవెలుగువెబ్​, నందికొట్కూరు:నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారమంచాల గ్రామంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి అకాల మరణం తో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయం లో  టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అంతకుముందు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే  సుధాకర్  ,మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి  సుధాకర్ రెడ్డి, పలువురు  రాజకీయ ప్రముఖులు పారుమంచాల గ్రామానికి చేరుకుని చంద్రమౌళి రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు చంద్రమౌళి రెడ్డి అంత్యక్రియలు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సొంతపోలంలో  సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సిఎం జగన్ మోహన్  రెడ్డి టిటిడి ఈవో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా టిటిడి ఈవో ధర్మారెడ్డి స్వగ్రామమైన పారమంచాల గ్రామం చేరుకుని అకాల మరణం తో చనిపోయిన కుమారుని మృతికి  ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు దైర్యం గా ఉండాలని తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పరామర్శించారు.

About Author