PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పర్యట… స్పందన కార్యక్రమం రద్దు

1 min read

జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఈ నెల 17 వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైయస్సార్ సెంటినరీ హాలులో ఈ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని డివిజన్, మండల,మునిసిపాలిటీల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

About Author