PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో ముగ్గురికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలం లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులకు ఉత్తమ అధికారులుగా గుర్తిస్తూ వారికి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు కలెక్టర్ ప్రశంశా పత్రాలను అందజేశారు.77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి షేక్ అంజాద్ భాష,నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ హాజరయ్యారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.మిడుతూరు ఎంపీడీఓ జిఎఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ జె.రమేష్ వీరి ముగ్గురికి ఉత్తమ అధికారులుగా జిల్లా అధికారులు గుర్తించారు. అందుకుగాను జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు కలెక్టర్ చేతుల మీదుగా వీరి ముగ్గురికి ప్రశంసా పత్రాలను వారు అందజేశారు.ప్రశంశా పత్రాలను అందజేసినందుకు గాను ముగ్గురు అధికారులు మంత్రికి మరియు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి టి.విజయ భాస్కర్ నాయుడు,జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈవో ఈవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

About Author