PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏటీఎం కెమెరాల‌కు రంగేసి.. ముఖానికి ముసుగేసి… !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :క‌డ‌ప న‌గ‌రంలో ఏటీఎం దొంగ‌లు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో 41 ల‌క్షల రూపాయ‌లు దోచుకెళ్లారు. క‌డ‌ప న‌గ‌రంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ క‌ళాశాల ఏటీఎం వ‌ద్ద 17 ల‌క్షల రూపాయ‌లు అప‌హ‌రించారు. గ్యాస్ క‌ట్టర్ ఉప‌యోగించి ఏటీఎంను క‌ట్ చేశారు. సీసీ కెమెరాల‌కు న‌ల్లని రంగు పూశారు. దీంతో పాటు రిమ్స్ ప‌రిధిలోని రామాంజినేయ‌పురం ఏటీఎం వ‌ద్ద 24 ల‌క్షలు దోచుకెళ్లారు. ఇక్కడ కూడ గ్యాస్ క‌ట్టర్ ఉప‌యోగించి ఏటీఎం ధ్వంసం చేశారు. పోలీసులకు స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. అనంత‌రం జాగిలాల‌తో ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలించారు. కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author