PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైపాలెంలో ఉమ్మడి జిల్లా స్థాయి పొట్టేళ్ల పందాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి పొట్టేళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు మర్రి రామేశ్వరుడు,ఎన్ శ్రీరాములు,జి రామకృష్ణ తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ ఉదయం 9:30 నిమిషములకు ఈ పొట్టేళ్ల పందాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.పొట్టేళ్ల పందాలలో పాల్గొనదలచిన వారు 19వ తేదీ సాయంత్రం లోపల ప్రవేశ రుసుము 300 రూపాయలు చెల్లించి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా వారు కోరారు.మరిన్ని వివరాలకు మర్రి రామేశ్వరుడు-9000375654,ఎన్ శ్రీరాములు-9550494675,జి రామకృష్ణ-9666876505 నంబర్లకు సంప్రదించవచ్చు.

About Author