PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుణాల ఉత్సవాలు చూద్దాం రారండి

1 min read

– నేడే కొణిదేలలో స్వామి వారి రథోత్సవం..
– వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో వెలసిన శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తిరుణాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లరథోత్సవం కార్యక్రమం ఆదివారం మార్చి 5న నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ కొంగర నవీన్, కార్యనిర్వహణాధికారి యం. కార్తీక్ ,ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్ , కమిటీ సభ్యులు తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పాల్గుణ మాస శుద్ధ దశమి మార్చి 2 నుంచి మార్చి 7 వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 2న గురువారం స్వామి వారి కళ్యాణం, 3 న శుక్రవారం ఏనుగు సేవ, 4 న శనివారం ప్రభోత్సవం, 5 ఆదివారం రథోత్సవం, 6న సోమవారం పారువేట ,7న మంగళవారం వసంతోత్సవముతో ఉత్సవాలు ముగుస్తాయి.గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.వివిధ రకాల పోటీలు..బల ప్రదర్శనలు..తిరుణాల సందర్భంగా గుండు పందెం, పొట్టేళ్ల పందెం,పాల పండ్ల ఎద్దుల బండ పందెం, పెద్ద బండ ఎద్దుల పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తిరుణాలకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బండలాగుడు పోటీలలో పాల్గొను ఎద్దుల యజమానులు 9492570227, 8790002654, 9849853602, ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.బండ పందెమునకు వచ్చిన వారికి శ్రీ సత్యన్నారాయణ స్వామి గుడి దగ్గర గ్రామ రైతు సంఘం మరియు గ్రామ ప్రజల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చేపల మహేష్ అన్నారు .
ఎద్దులు బండలాగుడు పోటీలు ప్రత్యేక ఆకర్షణ
ఆదివారం స్వామి వారి రథోత్సవం రోజు పాలపండ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.మొదటి బహుమతి రూ.60 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడవ బహుమతి రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలు, ఐదవ బహుమతి రూ.10 వేలు, ఆరవ బహుమతి రూ.5వేలు ప్రకటించారు.మార్చి 6న అంతర్రాష్ట్ర స్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు.శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని మార్చి 6న సోమవారం పారువేట సందర్భంగా ఉదయం 7 గంటలకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దులు పెద్దబండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచి కొంగర నవీన్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్, గ్రామ రైతు సంఘం నాయకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వృషబాలకు మొదటి బహుమతి రూ.70 వేలు, రెండవ బహుమతి రూ. 50,000, మూడవ బహుమతి రూ. 30,000, నాలుగో బహుమతి రూ. 20,000, ఐదవ బహుమతి రూ. 10,000, ఆరవ బహుమతి రూ.5,000 అందజేయడం జరుగుతుందన్నారు. శనివారం ప్రభోత్సవము సబ్సందర్భంగా నంది కోల సేవ కార్యక్రమం, రాత్రి గుండుఎత్తు పందెం ఉంటుంది. సోమవారం పోటేళ్ల పందెం ఉంటుందని తెలిపారు.ఎనిమిదేళ్లుగా జాతరలో ఉచిత నీటి సరఫరా…కొణిదేల తిరుణాల సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఎద్దుల బండలాగుడు పోటీలను పురస్కరించుకుని తిలకించడానికి వచ్చు ప్రజానీకానికి ఉచిత మంచినీటి సౌకర్యం కలిపిస్తున్నారు గ్రామానికి చెందిన సాలే పెద్ద బాలన్న. ఎద్దుల బండలాగుడు పోటీలు ముగిసే వరకు మంచినీటిని అందిస్తున్నారు. దాదాపు గా ఎనిమిదేళ్లుగా జాతరకు వచ్చు భక్తులకు దప్పిక తీర్చుతూ ప్రజల మన్ననలు పొందారు.సమావేశంలో ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, నాగలక్ష్మమ్మ, కురువ వేణుగోపాల్, చిన్న పుల్లయ్య, రామేశ్వరమ్మ, కళావతమ్మ, గ్రామస్తులు పెద్ద బాలన్న, రంగస్వామి, కొణిదేల బెస్త రాజు, గోపాల్ ,రాజేశ్వరరావు,కొంగర మూర్తి, మల్లెపోగు చిట్టెన్న,రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author