PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్రెయిన్ నుంచి వెనక్కి రండి .. యూఎస్ కీలక ఆదేశాలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ అంశంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబాలను వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యా నుంచి నిరంతర ముప్పు పొంచి ఉందని పేర్కొంది. రాయబార కార్యాలయంలోని సిబ్బంది సైతం స్వచ్చందంగా వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అమెరికా పౌరులు కూడ వీలైనంత త్వరగా బయల్దేరి రావాలని కోరింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం 10 నుంచి 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్టు సమాచారం.

          

About Author