NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కప్​తో తిరిగి రండి.. :దాదాపీర్​

1 min read

జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపిక

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి:నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన అబుబకర్‌,అల్తాఫ్‌,షాహిద్‌లు గుంటూరులో జరిగిన క్రీడాకారుల ఎంపిక సందర్బంగా ప్రతిభ కనపరచి   జాతీయ స్థాయి సీనియర్  బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ సంచాలకులు దాదాపీర్‌ తెలిపారు.ఆదివారం ఆయన  విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయి కి ఎంపికైన వీరికి  ఈ నెల 28 నుంచి గుంటూరులో అంతర్జాతీయ బేస్‌బాల్‌ క్రీడాకారుడు ఆనంద్‌ ఆదిత్య ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు.  జాతీయ స్థాయి కి ఎంపికైన వీరు సెప్టెంబర్ 7 నుండి 11 వ తేది వరకు పంజాబ్‌ రాష్ట్రం లోని జలంధర్‌ లోని లవ్లీ ప్రొపెషనల్‌ యూనివర్సిటీ లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి కి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర  బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు,వైసిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్‌,జిల్లా బేస్‌బాల్‌ సంఘం కార్యదర్శి సుబ్బయ్య,సంయుక్త కార్యదర్శి మహబూబ్‌ భాష లు  అభినందించారు.

About Author