విజయంతో..తిరిగి రండి …
1 min read
16 నుంచి జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు
- బాక్సర్లను అభినందనలు తెలిపిన డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్
కర్నూలు, న్యూస్ నేడు: చత్తీస్ ఘట్ రాష్ట్రం రాయపూర్లోని సింగ్ జంజా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ సూచించారు. ఏప్రిల్ 5,6వ తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీలో విజయం సాధించిన బాక్సర్లు… జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూల్ నుంచి సుజిత్,హరి కళ్యాణ్, అశోక్,రింగు విభాగంలో , తతామి విభాగంలో జయ కళ్యాణ్, ఉపేంద్ర ఉప్పరి, హరిచంద్ర ప్రసాద్, మురళి మోహన్, కోచ్ మహేష్ రెఫరీగా నరేంద్ర ఆచారి చత్తీస్ గడ్ రాయపూరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కిక్ బాక్సర్ల ను డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ అభినందించారు. పోటీలో కర్నూలు సత్తా చాటి.. పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో కర్నూలు జిల్లాకు, ఏపీకి మంచి పేరు తీసుకురావాలని సూచించిన డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్.. పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేసి… క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.