PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రా…. లీలలకు కేంద్ర బిందువు మహానంది క్షేత్రం..?

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది రా… లీలలకు కేంద్ర బిందువు..? అయిందని పలువురు చర్చించుకుంటున్నట్లు సమాచారం. తప్పు చేసిన వారిపై వేటు వేస్తున్నామని పైకి ప్రకటిస్తున్న అది కొంతమందికే వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి రా…. లీలలు 2+1 పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల క్షేత్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన కాలసర్ప దోస నివారణ కొరకు పూజలు నిర్వహించే ప్రాంతం వెనుక భాగాన చీకటిగా ఉండడంతో తమ పని తాము చేసుకోపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఒకరిద్దరు గుర్తించినట్లు సమాచారం. బయటికి పొక్కకుండా ఉండేందుకు కొంత మొత్తాన్ని సమర్పించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా కెమెరాల కంటికి చిక్కకుండా ఆ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లు తెలుస్తుంది. అధికారుల దృష్టికి కూడా పోయింది అనే ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం గత కొన్ని రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. కళ్యాణమండపం పక్కన ఉన్న సందులో కూడా కొద్ది రోజులు నిరాటంకంగా సాగినట్లు ప్రచారం. ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని మకాం కాలసర్పదోష నివారణ ఆలయం వెనుక భాగానికి మార్చినట్లు గుసగుసలు వినవస్తున్నాయి.

About Author