PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాహం తీర్చుకునేందుకు వచ్చి..

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: అటవీ ప్రాంతం నుంచి దాహం తీర్చుకునేందుకు ఓ జింక (దుప్పి)ను కుక్కలు వెంబడించగా స్థానికులు రక్షించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం మహానంది పట్టణంలోని ఈశ్వర్​నగర్​లో చోటు చేసుకుంది. గ్రామస్తులు జింకను అటవీశాఖ రేంజ్​ ఆఫీసర్​ ముత్తుజాకు అప్పగించారు. వేసవి తాపం తాళలేక.. అడవిలోని జంతువులు దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. అడవిలో అక్కడక్కడ గుంతలు ఏర్పాటు చేసి నీటిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరారు.

About Author