PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వరలో.. సీఎం సమక్షంలో వైసీపీలోకి..

1 min read

– కప్పట్రాళ్ల బుజ్జమ్మ భర్త రామచంద్ర నాయుడు
పల్లెవెలుగు వెబ్​, దేవనకొండ: కొన్ని రోజులుగా ఏ పార్టీతో సంబంధం లేకుండా తటస్థంగా ఉన్నామని, త్వరలో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి సమక్షంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో వైసీపీ ఖండువా కప్పుకుంటామని కప్పట్రాళ్ల బుజ్జమ్మ భర్త, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు తెలిపారు. ఈనెల 8న జరగునున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేసిన రామచంద్ర నాయుడు.. తమతోపాటు అనుచరవర్గం వైసీపీలోకి చేరుతారని వెల్లడించారు. సమావేశంలో వైసిపి మండల నాయకులు తెర్నేకల్ రాజన్న, చిట్టెం చిన్నయ్య. నరసింహ స్వామి, ప్రతాప్, రాజు పాల్గొన్నారు.

About Author