PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తా : మ‌ంచు మ‌నోజ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘దొంగ దొంగది’ విడుదలై 18ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ప్ర‌ముఖ హీరో మంచు మ‌నోజ్ ట్విట్టర్‌లో భావోద్వేగ లేఖను షేర్ చేశాడు. ‘‘మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేను ఎంట్రీ ఇచ్చి నేటితో 18ఏళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్, సహ నటులు, మీడియాకు కృతజ్ఞతలు. మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానాలతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. నా మొదటి సినిమా నిర్మాతలు ఎన్‌వీ. ప్రసాద్ గారు, అశోక్ గారికి ధన్యవాదాలు. మీరు నా మీద పెట్టిన నమ్మకంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. ‘దొంగ దొంగది’ నాకు ప్రత్యేకమైన చిత్రం. సుబ్రహ్మణ్యం గారు, అజయ్ విన్సెంట్ గారికి థ్యాంక్ యూ. నేను సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నానని నాకు తెలుసు. కానీ, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన విరామం. ఏది ఏమైనప్పటికి మీ హృదయాల్లో నాకు చోటిచ్చారు. నేను సినిమాలు చేయనప్పటికీ నా అభిమానులు మంచి పనులను కొనసాగించారు. ఈ విరామ సమయంలో అమ్మనాన్నలు, సోదరుడు, సోదరి నాకు అండగా నిలిచారు. ప్రత్యేకంగా నా సోదరి గురించి చెప్పుకోవాలి. నాకు వెన్నెముకగా నిలిచింది. ఆమెకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. అందరు ఇచ్చిన ఆశీర్వాదాలతోనే మీ ముందుకు వ‌స్తాన‌ని వాగ్దానం చేస్తున్నా “ అంటూ లేఖ‌లో మ‌నోజ్ పేర్కొన్నాడు.

                                                

About Author