PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రారంభమైన..శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ

1 min read

– మహా శివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఉదయం ప్రారంభమైంది. భక్తుల సౌకర్యార్థం 15 రోజుల పాటు అనగా ఫిబ్రవరి 9 నుండి 23తేదీ వరకు దీక్షావిరమణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.జనవరి 11 తేదీన శివమండల దీక్షను, జనవరి 30వ తేదీన అర్థమండలదీక్షను స్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో దీక్షను జ్యోతిర్ముడిని (ఇరుముడిని) సమర్పిస్తారు.ఈ జ్యోతిర్ముడి సమర్పణను పురస్కరించుకుని ఈ రోజుఉదయం మనోహర గుండం వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష పూజదికాలు జరిపించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను రథవీధిలోమంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో.. ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్ష శిబిరాలలో వేంచేబు చేయించడం జరిగింది. అనంతరం దీక్షా శిబిరాలలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారలతోపూజాదికాలు నిర్వహించబడ్డాయి. శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభించారు శివదీక్షా శిబిరాలలోని హోమగుండానికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలను జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాదారులు నమశ్శివాయ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

About Author