PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వసంత నగర్ పాఠశాలలో రాగి జావా పంపిణీ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి ఉదయము కర్నూలు మండలం వసంత నగర్ ప్రాధమిక పాఠశాల యందు మరియు ఉన్నత పాఠశాల యందు జగనన్న గోరుముద్ద లో నూతనంగా రాగి జావా పంపిణి కార్యక్రమం గొందిపర్ల గ్రామ సర్పంచ్ బి శ్రీనివాసులు గారు ప్రారంబించారు. ఈ సందర్భంగా జగనన్న గోరు ముద్ద కార్యక్రమంలో అన్నీ అంశాలు పిల్లల్లో ఆరోగ్యము వారికి సంపూర్ణ ఆరోగ్యం కలిగించే విధంగా వున్నాయి. ఎండ కాలం ప్రారంభ దశలో పిల్లల కు రాగి జావా పంపిణీ ప్రారంభం చేయడం చాలా మంచిది గ్రామం లో వున్న ఉన్నత పాఠశాల మరియు ప్రాధమిక పాఠశాల లో నేను ప్రారంభం చేయటం నాకు చాల సంతోషంగా వుంది.ఈ సందర్భం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు శ్రీ గోపాల్ మరియు వెంకట్ రాముడు, ఆ ప్టా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు, రాష్ర్ట ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుబ్బారాయుడు ప్రాధమిక పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రమీల కుమారి, ఉన్నత పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాుడు శ్రీనివాస రెడ్డి మరియు ఉన్నత పాఠశాల సిబ్బంది గారు పాల్గొన్నారు.

About Author