NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల పక్షాన నిలచేది కమ్యూనిస్టులే… డి రాజా సాహెబ్

1 min read

పత్తికొండ, న్యూస్ ​నేడు: పేదలకు కూడు గుడ్డ గూడు తోపాటు వారి మెరుగైన జీవితం కోసం పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ స్పష్టం చేశారు. సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఆవిర్భవించిన ఎర్రజెండాను చేతబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న కమిస్టులు అంటే ప్రపంచ దేశాల్లోనే ఎంతో గుర్తింపు ఉందని తెలిపారు. పేదల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు గా ఉండటం ఎంతో గర్వంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలోని వీకే ఆదినారాయణ రెడ్డి కాలనీ శాఖ మహాసభలు జరిగాయి. ముందుగా ఆ పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ మండల కార్యదర్శి డి  రాజా సాహెబ్ ఆవిష్కరించారు. అనంతరం వి కే ఆదినారాయణ రెడ్డి శాఖ మహాసభలకు శాఖ కార్యదర్శి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎన్నో పోరాటాలలో సిపిఐ కీలక భూమిక పోషించిందని, భూ పోరాటాల ద్వారా పేదలకు లక్షలాది ఎకరాలు పంచి పెట్టి, వేలాది గ్రామాలను విముక్తి చేసిందని అన్నారు. ఈ పోరాటాలలో వేలాదిమంది ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తుల చరిత్ర సిపిఐ కి  దక్కిందని చెప్పారు. బూర్జువా పార్టీలు స్వప్రయోజనాల కోసమే అజెండాగా రాజకీయ పార్టీలు పనిచేస్తాయని,  ప్రజా శ్రేయస్సే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యమని అన్నారు. ప్రజా  హక్కులను కాలరాస్తున్న  పాలక పక్షాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్ కృష్ణయ్య కారన్న తిమ్మయ్య పెద్ద ఈరన్న సిపిఐ ప్రజా సంఘాల నాయకులు రంగన్న శ్రీనివాసులు ఏం కే సుంకన్న నాగేంద్ర రవి పరమేశు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *