PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఎన్​ఎంపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట్ల పీహెచ్​సీ పరిధిలో మాలపల్లె గ్రామంలో వ్యాక్సిన్​ విషయంలో ఏ ఎన్​ఎంపై ప్రమీలతో అసభ్యకరంగా మాట్లాడిన వీరారెడ్డి అనే వ్యక్తిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి. శాంతి భవాని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్​ వేయిస్తోందని, ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వైద్యాధికారులతో మాట్లాడాలని సూచించారు. ఏఎన్​ఎంపై దురుసుగా మాట్లాడటం, దాడికి దిగడం తగదన్నారు. ఈ విషయంపై కలెక్టర్​, డీఎంహెచ్​ఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఏ. ఎన్. ఏం. అధ్యక్షురాలు సులోచనమ్మ, పి. హెచ్. సి. పరిధిలోని స్టాఫ్ నర్సులు, ఏ. ఎన్. ఏం.లు పాల్గొన్నారు.

About Author