PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైప‌ర్ ఆది పై ఫిర్యాదు ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పై తెలంగాణ జాగృతి సంస్థ విద్యార్థి సంఘ నాయ‌కులు ఎల్బీన‌గ‌ర్ ఏసిపి శ్రీధ‌ర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌర‌మ్మ, తెలంగాణ భాషను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైప‌ర ఆది, ఆ కార్యక్రమ స్ట్రిప్ట్ రైట‌ర్, మ‌ల్లెమాల ప్రొడ‌క్షన్స్ మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి స్టుడెంట్ ఫెడ‌రేష‌న్ నేత న‌వీన్ గౌడ్ త‌దిత‌రులు ఈ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆత్మగౌర‌వాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు భ‌విష్యత్తులో ఎవ‌రూ చేయకుండా, క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

About Author