PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు, లోకేష్ లపై  కేసు నమోదుకు  ఫిర్యాదు

1 min read

–  శ్రీశైలం నియోజకవర్గం  సోషల్ మీడియా టీం…

పల్లెవెలుగు వెబ్   ఆత్మకూరు: నారా లోకేష్ మూడు రోజుల క్రితం అంతకుముందు కూడా పాదయాత్రలో మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు ఏ కార్యకర్తల మీద ఎక్కువ కేసులో ఉంటాయో వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతకులకు విఘాతం కలిగించే విధంగా, రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని అందులో భాగంగా ప్రశాంతంగా ఉండే తంబళ్లపల్లి,  పుంగనూరు, మాచర్ల లాంటి నియోజకవర్గం వర్గాలలో కూడా గొడవలు సృష్టిస్తున్నారు.  రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని నారా లోకేష్, నారా  చంద్రబాబు నాయుడు, కింజారపు  ఆచ్చoనాయుడు మరియు ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో  శ్రీశైలం నియోజకవర్గం సోషల్ మీడియా తరఫున  ఫిర్యాదును అందించడం జరిగింది.

About Author