NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మామిడి చెట్లు నరికి వేత పై స్పందనలో ఫిర్యాదు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య  జిల్లాలోని బొట్లచెరువు గ్రామరైతు రామచంద్ర తన మామిడి చెట్లను గ్రామానికి చెందిన వ్యక్తులు  నరికి వేసినట్లుస్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిర్యాదు మేరకు స్థానిక ఎస్ ఐ  ఇనాయతుల్లా  మామిడి  తోట ను పరిశీలించి చెట్లను నరికి  వేయడం నిజమేనన్నారు  .ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ బాధితులకి తగిన న్యాయం చేస్తామన్నారు ఈ సందర్భంగా మామిడి చెట్ల రైతు రామచంద్ర మాట్లాడుతూతన మామిడి చెట్లను తనపై కక్షతోనరికి వేసినట్లు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పోలీసులు తమకు న్యాయం చేయాలన్నారు..మామిడి చెట్లు నరికి వేసిన వ్యక్తులను త్వరగాపట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఏది ఏమైనా 10 కాలాలపాటుఉండాల్సిన మామిడి చెట్లను నరికి వేయడం దారుణమని గ్రామస్తులుఅంటున్నారు     .పోలీసులు మామిడి చెట్లు నరికి వేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About Author