PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్, టీవీ5 చైర్మన్ పై ప్రధానికి ఫిర్యాదు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు, టీవీ5 చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వైకాపా ప్రధానికి ఫిర్యాదు చేసింది. వారిద్దరి మ‌ధ్య లావాదేవీలు జ‌రిగిన‌ట్టు 15 మంది ఎంపీల‌తో కూడ బృందం ఫిర్యాదులో పేర్కొంది. మిలియ‌న్ యూరోలు బ‌దిలీ జ‌రిగిన‌ట్టు వైకాపా ఎంపీలు ఆరోపించారు. మ‌నీలాండ‌రింగ్, ఫెమా చట్టాల కింద విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఈ బృందానికి నేతృత్వం వ‌హించారు.

About Author