PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘యోగా’తో సంపూర్ణ ఆరోగ్యం

1 min read

ప్రముఖ వైద్యులు డా.కె.యి. శ్రీనివాస మూర్తి

పల్లెవెలుగు:యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు ప్రముఖ వైద్యులు డా. శ్రీనివాసమూర్తి. ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయడం వల్ల  మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా.చంద్రశేఖర్​ నేతృత్వంలో యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ యోగాసనాలు శరీరానికి ధృడత్వాన్ని,శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైన, చిన్నవారైన, ధృడంగా ఉన్న వారైన, లేనివారైన ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధన చేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్ధం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్య కరమైన శారీరక క్రమము నుంచి అంతరంగిక పరివక్రుత అనుభూతిలోకి వస్తుంది. యోగ మన జీవితంలో  అలవాటుగా మర్చుకోవాలని సూచించారు.  అనంతరం కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు డా. శ్రీనివాసమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు డా. భవాని ప్రసాద్​,  కల్కూర చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు. 

About Author