NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘రైతు బజార్​’ పనులు త్వరగా పూర్తి చేయండి

1 min read

– అధికారులను ఆదేశించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు రాయచోటి : రైతు బజార్ నిర్మాణాపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు. రాయచోటి పట్టణంలో రూ. కోటి నిధులతో నిర్మిస్తున్న రైతు బజార్ ను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా,మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, వైస్ చైర్మన్ విజయ భాస్కర్, మేనేజర్ సురేష్ లతో కలసి నిర్మాణ పనులను, కొనుగోలు దారులకు, రైతు వ్యాపారులకు కలగనున్న వసతులును ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తిచేసి ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు.

About Author