PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహాలను త్వరిత గతిన పూర్తి చేయండి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు:మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో జగనన్న కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నంతో కలిసి ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి పరిశీలించారు.గృహాలకు మెటీరియల్ సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అని మెటీరియల్ కరెక్ట్ గా ఉండే విధంగా చూడాలని సిబ్బందికి ఎంపీడీవో తెలియజేశారు.గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు.తర్వాత సచివాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్ కార్డులు) గురించి మాట్లాడారు.27వ తేదీన జరిగే ఆధార్ సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శివ కళ్యాణ్ సింగ్,ఇంజనీరింగ్ అసిస్టెంట్ రమేష్,వెల్ఫేర్ అసిస్టెంట్ రహీం తదితరులు పాల్గొన్నారు.

About Author