యువ స్పందన స్టడీ సర్కిల్ కు “కంప్యూటర్” అందజేత
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: నిరుపేద నిరుద్యోగుల కోసం ఏర్పాటుచేసిన పత్తికొండ యువస్పందన స్టడీ సర్కిల్ కు కంప్యూటర్ ను ఓ దాత బహుమతిగా అందించారు. సోమవారం స్థానిక స్టడీ సర్కిల్ యందు యువ స్పందన సొసైటీ అధ్యక్షులు లక్ష్మన్నకి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, రిటైర్డ్ ఏపీఎస్పిఆర్ఐసి ఉద్యోగి రమేష్ బాబు కంప్యూటర్ ను అందజేశారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన పత్తికొండ ప్రాంతం చుట్టుపక్కల నిరుద్యోగుల కోసం ఏర్పాటుచేసిన స్టడీ సర్కిల్ చాలా ఉపయోగకరమైనదని అన్నారు. స్టడీ సర్కిల్ లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు వీలుగా ఉందని తెలిపారు. అనంతరం యువ స్పందన స్టడీ సర్కిల్ కు కంప్యూటర్ బహుమతి అందజేసిన రమేష్ బాబుకి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యురాలు రాజేశ్వరి, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.