పాఠశాలకు బుట్టా ఫౌండేషన్ నుండి కంప్యూటర్, ప్రింటర్ విరాళం
1 min read
విద్యార్థుల ఆకాంక్షకు స్పందనగా బుట్టా ప్రతుల్ సహాయం
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని మైనారిటీ కాలనీలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు బుట్టా ఫౌండేషన్ వారు కంప్యూటర్ మరియు ప్రింటర్ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు విద్యకు అవసరం ఉందన్న అంశాన్ని గుర్తించి, ఫౌండేషన్ తరఫున ఈ సహాయాన్ని అందించారని నిర్వాహకులు తెలిపారు.గతంలో పాఠశాలను సందర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ , విద్యార్థుల నుండి కంప్యూటర్ అవసరంపై వచ్చిన అభ్యర్థనను గుర్తుచేసుకుని, తన సతీమణి బుట్టా సాహితి తో కలిసి ఈ రోజు పాఠశాల ప్రిన్సిపాల్ కి పరికరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ చరిత, నాయకులు సయ్యద్ చాంద్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుట్టా ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు.