PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది.. టి.జి భరత్

1 min read

– కర్నూల్లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టిడిపి నేతలు

– చంద్రబాబు అరెస్ట్ పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు స్పందిస్తున్నారన్న నేతలు

పల్లెవాణి వెబ్ కర్నూలు:  35 రోజులుగా జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని కర్నూల్లో టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు ఇతర నేతలంతా కలిసి నగరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసినట్లు వీరు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే ఆయన్ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆయన చాలా బరువు తగ్గారని.. ఇంకో 2 కేజీల బరువు తగ్గితే ఆయన కిడ్నీలకే ప్రమాదమని వారు చెబుతున్నారన్నారు. ఆయనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు  అరెస్ట్ ప్రభావం దేశమంతా కనిపిస్తోందని, ఇతర రాష్ట్రాలలో కూడా ఆయనకు మద్దతుగా ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు. నిరసన తెలిపే వారికి ఆటంకం కలిగిస్తున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై హైదరాబాద్ వాసుల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగేశ్వరరావు యాదవ్, నాగరాజుయాదవ్, శ్రీనివాస మూర్తి, సోమిశెట్టి నవీన్, అబ్బాస్, సత్రం రామక్రిష్ణుడు, నరసింహులు, రాజు యాదవ్, సముద్రాల శ్రీధర్, రాజ్యలక్ష్మి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author