NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ జీ మృతికి సంతాపం

1 min read

– నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం నేషనల్‌ వైస్‌చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : భారతదేశ రైతుల సంక్షేమం కోసం నిర్విరామ కృషి చేసిన దృఢ సంకల్ప నాయకుడు, సమర్థుడైన పరిపాలకుడు శిరోమణి అకాలీదళ్‌ అగ్రనేత, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌జీ మృతి చెందడం బాధాకరం అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం నేషనల్‌ వైస్‌చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. భారతదేశం ఒక గొప్ప మైనారిటీ నాయకుడిని కోల్పోయింది. సుఖ్‌బీర్‌ జీ కుటుంబ సభ్యులకు మరియు శిరోమణి అకాలీదళ్‌ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు.

About Author