వెంకటరాముడు మృతి పట్ల సంతాపం …
1 min read
సంతాపం తెలిపిన ఏపీ ఎస్ ఎస్ డిసిఎల్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని కలచట్ల గ్రామంలో ప్యాపిలి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటరాముడు మరణించడంతో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి వారి భౌతిక కాయాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య మరియు టిడిపి నాయకులు నివాళులు అర్పించారు.