PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాద్యాయుడు మురళి మోహన్ మృతి పట్ల సంతాపం

1 min read

: ఎస్ టి యు..

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల పరిషత్ ప్రాథమిక (మెయిన్) పాఠశాల ములుగుందం గ్రామం నందు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గోనెగండ్లకు చెందిన మురళీమోహన్ ఆచారి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. గోనెగండ్ల లోని ఇంటిదగ్గర మురళీమోహన్ ఆచారి భౌతికాయాన్ని ఎస్టియు నాయకులు సందర్శించి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి దేవ ప్రసన్నరాజు మాట్లాడుతూ మురళీ మోహన్ సార్ అకాల మరణానికి చింతిస్తున్నామని, మురళీమోహన్ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ను త్వరగా వచ్చే విధంగా సంఘం పరంగా ప్రయత్నిస్తామని ఉన్నారు.నివాళులర్పించిన వారిలో ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు, టీ ఎల్లప్ప, ఎస్ టి యు సీనియర్ నాయకులు డి వెంకటేశ్వర్లు ,జగదీష్, ఎస్టియు గోనెగండ్ల మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author