NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కండోమ్ లు ఎక్కువ‌గా వాడేది ముస్లింలే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దేశంలో ముస్లిం జ‌నాభా పెరుగుతోంద‌ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు పెర‌గ‌డం లేద‌ని పడిపోయింద‌ని చెప్పారు. “బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది. కండోమ్‌లు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మేమే. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు” అని అసదుద్దీన్ ఒవైసీ ఒక సభలో చెప్పారు. బుధవారం మోహన్ భగవత్ ‘జనాభా అసమతుల్యత’ సమస్యను లేవనెత్తుతూ, అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వర్తించే విధంగా బాగా ఆలోచించి, సమగ్ర జనాభా నియంత్రణ విధానం కోసం పిలుపునిచ్చారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన అంశమ‌ని, దాన్ని విస్మరించరాదని కూడా ఆయన అన్నారు.

                                       

About Author