NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ కూటమి’ పై నమ్మకం పెరిగింది…

1 min read

ఉద్యోగుల బకాయిలకు రూ. 6200 కోట్లు కేటాయించడం సంతోషకరం..

  •  నిధులలో రిటైర్డు పెన్షనర్లకు గుర్తిస్తే… బాగుంటుంది..
  • ఉద్యోగ భద్రతకు ‘ కూటమి’ భరోసానిచ్చింది..
  • పి.ఆర్​.సి. పే స్కేల్​ కు.. కమిషన్​ ను నియమించాలి
  • ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు డిమాండ్​

కర్నూలు, న్యూస్​ నేడు:గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు అభద్రత భావం ఉండేదని, వేల కోట్లు బకాయిలు పెండింగ్​ పెట్టారని  తీవ్ర ఆందోళనకు గురైన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్​ బొప్ప రాజు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ. 6200 కోట్లు పైగా కేటాయించడం  ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  కర్నూలు కలెక్టరేట్​ లోని పొదుపు భవనంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్​ నాగరాజు అధ్యక్షతన శుక్రవారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్​ బొప్ప రాజు వెంకటేశ్వర్లుతోపాటు సహ చైర్మన్​ శ్రీనివాస రావు అమరావతి జిల్లా కార్యవర్గంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్ప రాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల బకాయింపు చెల్లించేందుకు రూ. 6200 కోట్లు కేటాయించడం అభినదంనీయమని, దీంతో ఉద్యోగులకు భరోసా, నమ్మకం పెరిగిందన్నారు. ఈ నిధులలో రిటైర్డు పెన్షనర్లు కు కొంత కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.  అదేవిధంగా కాంట్రాక్ట్​ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరారు.

ఎప్పటికప్పుడు డి.ఏ.లు చెల్లించాలి

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన జి.పి.ఎఫ్​, ఏపీ జి.ఎఫ్​, మెడికల్​  తదితరవి ఇవ్వలేదని, డి.ఏ.లు కూడా పెండింగ్​ పెట్టి వెళ్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఏలు చెల్లించిందని, ప్రస్తుతం 2024 జనవరి, జూలై, 2025 జనవరి  డి.ఏ.లు మాత్రమే పెండింగ్​ లో ఉందని, అవి కూడా త్వరగా ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఏ.లు ఎప్పటికప్పుడు చెల్లిస్తే సమస్య ఉండదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్​ బొప్ప రాజు వెంకటేశ్వర్లు  అభిప్రాయం వ్యక్తం చేశారు.

పి.ఆర్​.సి. పే స్కేల్​కు కమిషన్​ ను నియమించండి

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించి పి.ఆర్​.సి. పే స్కేల్​ కు సంబంధించి ఇప్పటి వరకు కమిషన్​ ను నియమించలేదని, ఈ విషయమై గత ప్రభుత్వానికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఐ.ఆర్​., పిఆర్​సి, అరియర్స్​  1.07.2018 నుంచి 31.12.2021  వరకు ఇవ్వలేదన్నారు.  ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో పి.ఆర్​.సి. కమిషన్​ ను అధికారికంగా నియమించాలని  ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్​ బొప్ప రాజు వెంకటేశ్వర్లు  డిమాండ్​ చేశారు.

ఏపీ జేఏసీ కర్నూలుకు ప్రశంస..

ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ఒత్తిడి తీసుకువస్తామన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్​ బొప్ప రాజు వెంకటేశ్వర్లు… కర్నూలు జిల్లా కార్యవర్గంపై ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లాలో కాంట్రాక్ట్​, అవుట్​ సోర్సింగ్​, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా.. వెంటనే  కర్నూలు జిల్లా అధ్యక్షుడు నాగరాజు తమ దృష్టికి తీసుకొస్తున్నాడని, ప్రభుత్వ సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్​ వై. కృష్ణ, జనరల్​ సెక్రటరి వెంకట రాజు, మహిళా సంఘం జిల్లా సెక్రటరి సహేరా భాను, రెవెన్యూ రాష్ట్ర ఆర్డనైజర్​ సెక్రటరి రజినికాంత్​ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *