PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాహనాలు రద్దీ… డబల్ రోడ్డు వెయ్యాలి

1 min read

– అఖిలభారత యువజన సమాఖ్య AIYF
పల్లెవెలుగు,వెబ్ పత్తికొండ: అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో పత్తికొండ చిన్నహుల్తి బిల్లేకళ్ళు కైరుప్పుల కారుమంచి మీదుగా ఎమ్మిగనూరు కు డబల్ రోడ్డు వెయ్యాలని AIYF ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ రోడ్డు భవనాల శాఖ అధికారికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం లో ఉన్న దేవాలయానికి కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు అనంతపురం గుత్తి కి సంబంధించిన భక్తులు దేవాలయానికి పత్తికొండ చిన్నవూల్తి బిలేకల్ కైరుప్పుల కారుమంచి మీదుగా ఎమ్మిగనూరు మరియు మంత్రాలయం కు వెళ్లడంతో సింగల్ రోడ్డు ఉండడం వల్ల వాహనాలు రద్దీగా తిరుగడంతో ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సింగల్ రోడ్డు ఉండడంవల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందువల్ల ఉన్నత అధికారులు వెంటనే స్పందించి డబల్ రోడ్డు వెయ్యాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ప్రజలను యువతను సమీకరించి దశలవారీగా ఆందోళన కార్యక్రమంలో చేపడతామని హెచ్చరిస్తున్నాం. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని రోడ్డు భవనాల శాఖ అధికారి DE గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యవర్గ సభ్యుడు యువరాజు ఆస్పరి మండలం నాయకులు సురేష్ మళ్లీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author