PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ రమేష్​ యాదవ్​కు అభినందన

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పురపాలక 13వ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వి రమేష్ కుమార్ యాదవ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారు అయింది. దీంతో శనివారం ఆయన స్వగృహంలో కడప జిల్లా యాదవ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి.. సన్మానించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసభ కడప నగర అధ్యక్షుడు కోప్పల శివ యాదవ్ మాట్లాడుతూ సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో దివంగత నేత డా. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ముందుండేవారని, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా అభివర్ణించారు. బీసీ ఉద్యోగ సంఘ అధ్యక్షులు నంద్యాల రాజశేఖర్ యాదవ్, ప్రొద్దుటూరు కృష్ణ ఆలయ చైర్మన్ బాల సుబ్బయ్య యాదవ్, శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు తెల్ల దార్ల విజయ్ కుమార్ యాదవ్, తెలుగు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు చిర్ల చెన్నయ్య యాదవ్, అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి కొంగాని శ్రీనివాసులు యాదవ్, సదాశివయ్య యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ రమేష్​ యాదవ్​కు శుభాకాంక్షలు తెలిపారు.

About Author