NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షురాలుగా సిట్రా సత్యనారాయణమ్మకు అభినందనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కురువ  సంఘం… కర్నూలు జిల్లాలో 4 లక్షల ఓటర్లు ఉన్న కురువలను గుర్తించి కురువ మహిళకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ జిల్లాఅధ్యక్షురాలు  పదవి ఇవ్వడంతో  ఆమెకు   అభినందనలు తెలుపుతూ శాలువతో సత్కరించారు. కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి, సహాయ కార్యదర్శి కొత్తపల్లి దేవేంద్ర, కోశాధికారి కె సి నాగన్న పట్టణ అధ్యక్షుడు తవుడు  శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా వైస్సార్సీపీ  కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గడ్డం రామకృష్ణ భార్య సిట్రా సత్యనారాయణమ్మను కలిసి అభినందనలు తెలిపారు.

About Author