PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి శ్రీ సిద్ధ రామయ్యకి అభినందనలు

1 min read

– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  జై లక్ష్మీ నరసింహ యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయుచున్న గౌరవనీయులు శ్రీ సిద్ధరామయ్యకి నంద్యాల పార్లమెంట్  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కర్ణాటకలో అధికార బిజెపి కుట్రలను ఎత్తుగడలను చిత్తు చేసి కర్ణాటక రాష్ట్ర ప్రజల అభిమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అహర్నిశలు కృషిచేసిన కర్ణాటక రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ డీకే శివకుమార్ కి ఏఐసీసీ అబ్జర్వ్ గా మన రాష్ట్రం నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కి మరియు పిసిసి అధ్యక్షులుకి నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు జ. లక్ష్మీ నరసింహ యాదవ్.

About Author