PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైనిక్​ స్కూల్​కు ఎంపికైన విద్యార్థులకు అభినందన: కర్నూలు ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నుండి చిత్తూరు, విజయనగరం సైనిక్ పాఠశాలలకు ఎంపికయిన 6 మంది విద్యార్దులను అభినందించారు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సైనిక్​ స్కూల్​కు ఎంపికైన విద్యార్థులు ఎస్పీని కలిశారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాలలో 6 వ తరగతికి అజయ్ , సోల్ మాన్ రాజు ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లాలోని కలికిరి సైనిక పాఠశాలలో 9 వ తరగతికి వినయ్ కుమార్, నవనీత్ ప్రీతం 6వ తరగతికి రంగారెడ్డి, అభిరాం లు ఎంపికయ్యారు. విద్యార్థులను, సైనిక పాఠశాలలో ఎంపిక కావడానికి శిక్షణ ఇచ్చిన కర్నూలు , ఎస్ హెచ్ ఎస్ కోరుకొండ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ఎస్పీ సుధీర్​ కుమార్​ రెడ్డి అభినందించారు. మంచి స్ధాయికి ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో కర్నూలు తాలుకా సిఐ కంబగిరి రాముడు, ఎస్ హెచ్ ఎస్ కోరుకొండ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హారి, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author