PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీహెచ్​పీ కార్యకర్తలకు.. అభినందన..

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని:  కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీ వాసవీ కన్వన్షన్ లో జరిగిన రెండు రోజుల దక్షిణాంధ్ర ప్రదేశ్  రాష్ట్ర సమావేశాలలో రెండవ రోజైన ఈరోజున….  గత సం. నవంబర్ 6 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు  విశ్వహిందూ పరిషత్ మూడు సం.ల ఒక సారి నిర్వహించే హితచింతక్ అభియాన్ ( సభ్యత్వ నమోదు) కార్యక్రమంలో దక్షిణాంధ్ర ప్రదేశ్ లోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన కర్నూలు జిల్లా కార్యకర్తలకు కేంద్రీయ సంయుక్త మహామంత్రి స్థాణు మిలియన్(బెంగళూరు) రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి,కార్యదర్శి కాకర్ల రాముడు గార్ల చేతులమీదుగా అభినందనలు అందుకున్నారు. వారిలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసిన కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ (6000)..జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్(2000),జిల్లా కోశాధికారి (1500) సభ్యత్వాన్ని నమోదు చేశారు.వీరందరికీ నగర,జిల్లా,రాష్ట్ర కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

About Author