PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంట‌ల్లో కాంగ్రెస్ కార్యాల‌యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. ప్రచారం కోసం సిద్ధంగా ఉంచిన జెండాలు, పోస్టర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, తమను దెబ్బతీసేందుకు జరిగిన రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

                                               

About Author