PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కాంగ్రెస్ ను వెలివేయ‌లేదు.. కేవ‌లం రూపం మార్చుకుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదని, రూపం మార్చుకుని అదే రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కలిగిందని గతంలో రాజధాని ప్రాంత రైతులు సంతోషం వెలిబుచ్చారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో అనుకూలమని తెలిపారు. కేంద్రం ఏపీ ముఖ్యమంత్రిని పెద్దకొడుకుగా చూస్తోందని అన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. అసలు రాజధాని లేకుండా పాలన చేయొచ్చని ఇక్కడి ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు.

                                  

About Author