NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం

1 min read

బీజేపీ ముక్త్ భారత్ కు ఇది తొలి అడుగు

 క్రాంతి నాయుడు బోయ, పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్థంబాల కూడలిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు బాణ సంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా క్రాంతి నాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ  136 స్థానాల్లో గెలవడం, 113 మేజిక్ ఫిగర్ దాటి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీ ముక్త భారత్ కు తొలి అడుగు అని అన్నారు. భజరంగ్ బలి రేపు హనుమాన్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గెలుపునిచ్చందన్నారు. బీజేపీ ముక్త దక్షిణ భారత్ దేశం ఏర్పడింది అని త్వరలో తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా విజయానికి ప్రయత్నం చేస్తాం అని అసెంబ్లీలోకి అడుగు పెడుతాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్రమ్ నాయుడు, షబ్బీర్, నాగార్జున, చిన్నా, ఫకృద్దిన్తదితరులుపాల్గొన్నారు.

About Author