NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌ల్మాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో మరో ముగ్గురు నిందితులు దీపక్‌ ముండీ, కపిల్‌ పండిట్‌, రాజీందర్‌ అలియాస్‌ జోకర్‌లను పంజాబ్‌ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు వారు విచారణలో వెల్లడించారని రాష్ట్ర యాంటీ-గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌(ఏజీటీఎఫ్‌) తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో, నేపాల్‌కు పరారయ్యేందుకు యత్నిస్తుండగా వారిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇప్పటి వరకూ 23మందిని పోలీసులు అరెస్టు చేశారు.

                                 

About Author