PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ పై కానిస్టేబుల్ అస‌భ్య‌క‌ర కామెంట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు అజయ్‌ గుప్తా అనే కానిస్టేబుల్‌. ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్‌ షాట్ల రూపంలో బాగా వైరల్‌ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు.

                                   

About Author