NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘రాజ్యాంగం’ ప్రమాదంలో ఉంది… :  బీఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో ఉందని బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మ రమేష్ అన్నారు. బుధవారం ఆస్పరి మండల కేంద్రంలో బిఎస్పీ కార్యాలయంలో మండల కన్వీనర్ కొమ్మ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలు ప్రవేటీకరణ చేసి పరోక్షంగా రిజర్వేషన్లు లను తీసి వేసేందుకు కుట్ర పడుతున్నారని, అదేవిధంగా లౌకికత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బహుజనులు అందరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ చక్రాల రవి కార్యకర్తలు హరి, చిన్న మహానంది ,రవితేజ తదితరులు పాల్గొన్నారు.

About Author