PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారత రాజ్యాంగం…ప్రపంచానికే ఆదర్శం..

1 min read

కల్లూరు తహసీల్దార్​ రమేష్​

ఘనంగా డా.బి.ఆర్​. అంబేద్కర్​ జయంతి

పల్లెవెలుగు వెబ్​: భారత రాజ్యాంగ నిర్మాత…. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బిఆర్​. అంబేద్కర్​ 132వ జయంతి వేడుకలను కల్లూరు తహసీల్దార్​ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి.. డా. బి.ఆర్​.అంబేద్కర్​ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ రమేష్​ అంబేద్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​, ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి మాట్లాడుతూ డా.బిఆర్​. అంబేద్కర్​ జీవితం.. ఎందరికో ఆదర్శమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను  నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహనీయుడు డా.బి.ఆర్​ అంబేద్కర్​ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను ఉద్యోగులు  ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్​ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author