PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

1 min read

– జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : పేదల సొంతింటి కల నెరవేర్చడంలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య. హౌసింగ్​ అధికారులు, సిబ్బంది ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో ‘ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు’ కార్యక్రమంపై హౌసింగ్ ఏఈ లు, డీఈలు ,వర్క్ ఇన్​ స్పెక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమంగా ఉండేలా కృషి చేయాలన్నారు. ఏఈలు, వర్క్ ఇన్​స్పెక్టర్లు, ఫీల్డ్ విజిట్ చేసి మొత్తం ఇళ్లన్నీ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. తొలుత ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్న లబ్ధిదారుల ఇళ్లను పూర్తిచేసి మిగతా ఇల్లు కూడా త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

‘క్వాలిటీ మెటిరియల్​’తో నిర్మాణం : జేసీ
ప్రభుత్వం పేదలకు నిర్మించే ఇళ్లకు క్వాలిటీ మెటీరియల్ వాడాలని జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య హౌసింగ్​ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అడ్వాన్స్​ మెటీరియల్ తెప్పించుకోవాలన్నారు. వంకలు, వాగులలో దొరికే ఇసుక ఇంటి నిర్మాణాలకు వాడకూడదని క్వాలిటీ ఇసుక మాత్రమే వాడాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అడిగిన వెంటనే ఇసుక టోకెన్లు ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల స్థలాల జాబితా తయారు చేసి తమకు పంపాలన్నారు. కరెంటు, సిమెంటు, స్టీలు,ఇసుక వంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి వెంకటరమణ, హౌసింగ్ ఏఈ లు, డీలు, వర్క్ ఇన్స్పెక్టర్ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author