PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి ..తాసిల్దార్

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: మండలంలోని కౌలురు గ్రామంలోని జగనన్న కాలనీ లో బుధవారం నాడు తాసిల్దార్ మల్లికార్జున రెడ్డి, మండల అభివృద్ధి అధికారి దస్తగిరి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉగాది నాటికి కేటాయించిన ఇంటి నిర్మాణాలు త్వరగా కట్టుకోవాలను జిల్లా సర్వోన్నత అధికారి ఆదేశించారని ,కావున త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ సందర్భంగా. జగనన్న కాలనీలోని లబ్ధిదారులు అధికారులతో మాట్లాడుతూ కాలనీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొన్ని గృహాలు పూర్తయిన కనీస మౌలిక సదుపాయాలు,డ్రైనేజి, కరెంట్, రోడ్లు లేవని రాత్రి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు త్వరలోనే మౌలిక వసతులు పాటు అయ్యేలా చూస్తామని తాసిల్దార్ మండల అభివృద్ధి అధికారి హామీ ఇచ్చారు .కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మధు, బాబర్,చాకలి శ్రీనివాస్, వెంకట చారి, ఖాదర్ బాషా, బాల మద్దిలేటి,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author