NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనారిటీ కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : టౌన్ మూడవ వార్డు మైనారిటీ కాలనీలలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి కాలనీవాసులు రోడ్డుకు సంబంధించిన ఇబ్బందులను చెప్పడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి అక్కడ రోడ్డు పనులు చేపటక పోవడంతో, రోడ్లమ్మిటి గుంతలు ఏర్పడి ప్రజలకు చాలా ఇబ్బందులుగా ఉండడంతో, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాల్సిందిగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కు చెప్పడంతో ఆయన ఆదివారం వెంటనే మైనారిటీ కాలనీ మూడో వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది, కాగా ఈ విషయంలో చెప్పిన వెంటనే పనులు చేపట్టడంపై మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాదక్ అలీ, ఉప సర్పంచ్ జుమన్, మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

About Author