PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవలు కొనసాగడం.. అభినందనీయం

1 min read
  • నగర మేయర్​ బివి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి
  • భగవాన్​ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు కుట్టుమిషన్లు, గ్రైండర్లు, ఇస్ర్తీ పెట్టెలు పంపిణీ

కర్నూలు, పల్లెవెలుగు:భగవాన్​ శ్రీ బాలసాయిబాబా మన మధ్య లేకపోయినా…. ఆయన పేరుతో సేవలు కొనసాగడం ప్రశంసనీయమన్నారు నగర మేయర్​ బివి రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు మదన గోపాల్​, ఎస్వీ మోహన్​ రెడ్డి.  ఆదివారం నగరంలోని శ్రీ బాలసాయిబాబా దేవాలయ ఆవరణలో  భగవాన్​ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు, ప్రపంచ శాంతి సదస్సు ను సాయిబాబా సెంట్రల్​ ట్రస్టు చైర్మన్​ టి. రామారావు నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య  అతిథులుగా బీవీ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి మాట్లాడుతూ  బాల సాయిబాబా సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం దేవుడి ఆరాధనలో గడిపిన ధన్య జీవులని కొనియాడారు. అనంతరం భగవాన్​ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులు చదివేందుకు చెక్కు.  మహిళలకు కుట్టుమిషన్లు, చిరు వ్యాపారులకు ఇస్ర్తీ పెట్టెలు, గ్రైండర్లు పంపిణీ చేశారు. ఆ తరువాత సాయిబాబా వారి 2024  సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో బాలసాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author